ATP: శ్రీరామరెడ్డి తాగునీటి పథక కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. కలెక్టర్ ఆనంద్ చొరవతో కార్మికుల ఖాతాల్లోకి 2 నెలల జీతాలు జమ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీతాల చెల్లింపుపై కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్కు కార్మికులు కృతజతలు తెలిపారు.