ATP: గుత్తి శివారులోని చెరువు కట్ట వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన టూ వీలర్తో నిలబడి ఉన్న హరిజన రాము అనే వ్యక్తిపై వెనుక వైపు నుంచి లారీ బైక్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాముకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.