WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ 2.0 అప్డేట్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తి క్రయవిక్రయాలు జాప్యమయ్యాయి. 3 రోజులుగా పోర్టల్ పని చేయకపోవడంతో శుక్రవారం మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగలను బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. సమస్యలు త్వరలో పరిష్కరించి రెండు, మూడు రోజుల్లో సేవలు పునరుద్ధరిస్తామని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.