KNR: మొలంగూర్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని, గత ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, ఇందులో మెజారిటీ ద్విచక్ర వాహనదారులే ఉన్నారని పేర్కొన్నారు.