KNR: హుజురాబాద్ మండలం సింగాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ శంకర్ ఆధ్వర్యంలో గురువారం రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచనలు సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐ కరుణాకర్, MVI వేణు, అధ్యాపకులు పాల్గొన్నారు.