BHPL: గీసుకొండ మండలం కొమ్మాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర హోలీ సందర్భంగా ఏటా వైభవంగా జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి ప్రభ బండ్లతో భక్తులు తరలివస్తారు. గిరిజనులు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం, స్వామివారికి ఎడ్లు-మేకలు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. గతేడాది జాతర రాజకీయ ప్రదర్శనలతో హోరెత్తింది. జాతరకు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.