ATP: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ అస్రత్ వలి తెలిపారు. కొనకొండ్ల, నార్పలలోని కళాశాలల్లో ప్రవేశాల కోసం జిల్లా వ్యాప్తంగా 776 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు.