PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని పెంకుటిల్లు కాలనీలో ఇటీవల ఏర్పడిన విద్యుత్ సరఫరా అంతరాయంపై (ఏపీఈపీడీసీఎల్) వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిందని అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు. సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ దృష్టికి వెళ్ళడంతో వెంటనే స్పందించిందని చెప్పారు. సమస్య ఏర్పడిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి చర్యలు చేపట్టామన్నారు.