కోనసీమ: రావులపాలెంలో 11కేవీ లైన్ ట్రీ కటింగ్, క్లియరెన్స్ పనుల నిమిత్తం శనివారం ఈతకోట, పొడగట్లపల్లి, లక్ష్మి పోలవరం, గోపాలపురం, రావులపాడు, ఊబలంక గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు పేర్కొన్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.