SKLM శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ ఐటీఐలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కె. సుధ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉ. 10 గంటలకు హాజరుకావాలని అన్నారు. వివిధ సంస్థల్లో 345 ఉద్యో గాలను భర్తీ చేయనున్నట్లు , ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.