E.G: పంచాయితీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. కోలమూరు పంచాయతీలో ఉన్న అనేక సమస్యలు అభివృద్ధి పనులపై కమిషనర్తో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్యం అసలు బాగాలేదని ఎక్కడి చెత్త అక్కడే పెరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.