ATP: తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి శనివారం యాడికి మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో తాడిపత్రిలోని తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, సచివాలయ సేవలపై కూడా చర్చించారు.