TPT: CMRF చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. వేడిచర్ల గ్రామానికి చెందిన శివరాం సలోమికి రూ. 30,028, జడ్డా జయమ్మకు రూ. 23,920 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం సహాయనిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.