ATP: గుంతకల్లులోని ఉర్దూ జూనియర్ కళాశాలలో మరమ్మత్తు పనుల కోసం రూ.50లక్షల నిధులతో శనివారం మండల ఇన్ఛార్జ్ నారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పూజ చేసి పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో రూ.8 కోట్లతో నిర్మించిన ఈ కళాశాల గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాడైపోయిందన్నారు. కూటమి ప్రభుత్వంలో కళాశాలలో మరమత్తు పనులు చేపట్టామన్నారు.