KNR: ఇల్లందకుంట మండలం సీతంపేటలో అంగన్వాడీ భవనం పశువుల పాకగా మారింది. 2014లో మంజూరైన బడ్జెట్తో భవనం అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం రెండు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో ఒకే గదిలో నడవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరం కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పంపడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.