NRML: ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం12 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఎంహెచ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ పట్టణం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్ ఎస్సీలకు 12 లక్షల అభయ హస్తం ప్రకటించి నేటికి రెండు సంవత్సరాలు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు.