ADB: ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను ఈ నెల 27 వరకు పొడిగించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుని, సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లో తమ పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.