ఖమ్మంలో చెల్లని చెక్కు కేసులలో కూసుమంచికి చెందిన వెంకన్నకు ఒకటో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి బెక్కమ్ రజిని 6 నెలల జైలు ఫిర్యాదుదారుడు వెంకటేశ్వరరావుకు రూ. 8 లక్షల నగదు చెల్లించాలని తీర్పు చెప్పారు. మరో కేసులో కొత్తగూడేనికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నాగభూషణంకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ రెండో అదనపు న్యాయమూర్తి ఏపూరి బిందు ఉత్తర్వులు జారీ చేశారు.