WNP: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల కుల దృహంకారులను అరెస్ట్ చేయాలని ఆదర్శ్ నగర్ కాలనీలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి జరుగుతున్న కుమ్మెర గ్రామ ఉత్సవాలలో ఆలయంలోకి ప్రవేశించకుండా రజకులను అడ్డుకోవడం అమానుషం అన్నారు.