MDK: రంగుల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి దామోదర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. హోలీ రంగుల్లా ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకున్నారు. రాష్ట్రం శాంతి, అభివృద్ధి, సౌభాగ్య మార్గంలో మరింత ముందుకు సాగాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.