గుంటూరులో ఆర్ఎంపీల సంఘం ఎఫ్ఈఎంపీఏ సభ్యులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత కల్పించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అసోసియేషన్ గౌరవ సలహాదారునిగా కొనసాగాలని వారు కోరగా ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నారు.