ASR: డుంబ్రిగూడ మండలం తుండ్రుంగూడలో ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఎస్.బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫాం వంటి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా రూ.13,000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.