W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయం సమీపంలో PRTU ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి CPSను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ఇవ్వాలనీ కోరారు.