TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రూ. 500 రాహు కేతువు పూజ యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఈవో వెంకటేశులు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీన పాలకమండలి సమావేశంలో వెండి ధర పెరుగుదల, నిర్వహణ వ్యయం పెరిగిన దృష్ట్యా రద్దు చేశారు. దీనిపై స్థానికులు, భక్తుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ధర్మకర్తల మండలి పునఃసమీక్షించి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.