కాకినాడ: జగ్గంపేట గ్రామంలో శివాలయం ఎదురుగా ఉన్న మండల పరిషత్ పాఠశాలలో “బడి పిలుస్తుంది” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మాజీ AMC ఛైర్మన్ SVS అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలకు హాజరైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవ్వాలన్నారు.