AKP: బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా గొలుగొండ మండల కేంద్రంలో ప్రైమరీ పాఠశాల, జోగంపేట ఉన్నత పాఠశాల సిబ్బంది సంయుక్తంగా మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలను వివరించారు.