GDWL: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో హాజరుకావాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.