SRPT: ఇమాంపేట శుద్ధి కేంద్రంలో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఫిబ్రవరి 24 ఉదయం నుండి 27వ తేదీ వరకు సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, పెన్పహాడ్ మండలాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని నిల్వ చేసుకుని, పొదుపుగా వాడుకోవాలని మిషన్ భగీరథ EE విజ్ఞప్తి చేశారు.