NZB: మగ్గిడి పాఠశాలలో 12 రోజులుగా సాగుతున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలికలు, 14 మంది బాలురను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి తెలిపారు. వీరు ఈనెల 24 నుండి మార్చి 1 వరకు పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో జరగనున్న జాతీయ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు.