ధురంధర్-2 దెబ్బకు పాక్లో భారత గూఢచరుల కోసం పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. ‘మూవీ చూశాక ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ఎదుటివారు ఇండియన్ ఏజెంట్ ఏమోననే అనుమానంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నా. దీనిపై దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుని బెగ్గర్స్ మొదలు అందరినీ విచారించాలి’ అని పేర్కొన్నాడు.