కర్నూల్: జిల్లాలో కూటమి ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సీనియర్ సిటిజన్ కార్డులను ఉచితంగా అందిస్తున్నట్టు మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఇవాళ తెలిపారు. దీంతో వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ కార్డులతో ఆర్టీసీ బస్సులు, ఆస్పత్రుల్లో రాయితీలు పొందవచ్చు.