మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో జాతీయ రహదారి 44పై గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న లారీ, దండుపల్లి చౌరస్తా వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.