BPT: యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలూరు గ్రామంలో జూదం జరుగుతోందన్న సమాచారంతో ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,480 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.