PPM: బిన్నిడి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. శనివారం జరిగిన ‘గ్రామ ముస్తాబు’ ఉత్సవంలో పాల్గొన్న ఆయన, గ్రామస్థుల ఐకమత్యం, పరిశుభ్రత, పచ్చదనం, మలేరియా నివారణ చర్యలను ప్రశంసించారు. రైతులు లాభదాయక పంటలపై దృష్టి పెట్టాలని, జీడి మామిడి తోటలను శాస్త్రీయంగా పునరుజ్జీవనం చేసుకోవాలని సూచించారు.