AP: మాజీ సీఎం జగన్ రాజకీయాల్లోకి రాకముందు హైదరాబాద్కు బిల్గేట్స్ని తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మహిళా రైతులపై వైసీపీ నేతలు కేసులు బనాయించారని తెలిపారు. రైతులు భూములే కాదని.. ప్రాణాలు కూడా ఇస్తామంటూ నిలబడ్డారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అమరావతికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.