KMR: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఈ నెల 30న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. స్థానికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.