MDK: రామాయంపేట మండల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని మండల తాహసిల్దార్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా జరుగుతున్న పాలనా విషయాలపై ఆరా తీశారు.