E.G: ఏపీ షెడ్యూల్డ్ తెగల (ST) కమిషన్ సభ్యులు కె.మల్లేశ్వరరావు, కె.లక్ష్మి శనివారం రాజమండ్రిలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కారాగార పర్యవేక్షణాధికారి వారికి స్వాగతం పలికి కమిషన్ సభ్యులకు కారాగారంలోని వివిధ విభాగాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఖైదీలకు అందుతున్న వైద్య సేవలను, ఆహార సదుపాయాలను పరిశీలించారు.