BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీలో మంచినీటి సమస్యను సర్పంచ్ శాంతి శ్రీ త్వరితగతిన పరిష్కరించారు. గత 2 రోజులుగా పైపులైన్ మరమ్మతుల వల్ల నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, శనివారం స్వయంగా వాటర్ ట్యాంకు వద్దకు వెళ్లి పరిశీలించారు.