MHBD: బయ్యారం మండలంలోని కస్తూరినగరం, రామచంద్రపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలని సూచించారు. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.