KNR: కరీంనగర్ భగత్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా సాగింది. చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు.