NLR: దగదర్తి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై శనివారం ఏపీడీ స్వరూప్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. సామాజిక తనిఖీలో జరిగిన అవకతవకలలో రూ.13,20,419లకు గాను రూ. 2,10,363 రికవరీ చేశారు. మిగిలిన రూ.11,10,056 రికవరీ చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు.