ప్రకాశం: ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్పై ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్లో పాల్గొన్నా, నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా, తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.