VZM: వైసీపీపై విమర్శలు,బురద జల్లడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడం ఎందుకని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. జడ్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో జరిగిన దోపిడీని మాత్రమే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, రాజధాని, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమన్నారు.