SDPT: ‘పారాక్వాట్ ‘ గడ్డి మందు వాడకంపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి స్వరూపరాణి తెలిపారు. ఈ రసాయనం వాడకం వల్ల మనుషులు, పశువులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గడ్డి మందు ఉత్పత్తులను ఎవరూ వాడవద్దని ఆమె సూచించారు.