పల్నాడు జిల్లాలో “మనబడి మన భవిష్యత్” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 13 తేదీ నాటికి పనులు పూర్తి చేయాలన్నారు.