NDL: డోన్ మండలం కొచ్చేరువులో బుధవారం కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పర్యటించి ఉల్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పంటకు వచ్చిన ఖర్చులు, దిగుబడి, రవాణా వ్యయం, మార్కెట్ ధరల గురించి రైతులను అడిగి వివరాలు సేకరించారు. రైతులకు న్యాయమైన ధర అందేలా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు. దళారులను నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని రైతులకు సూచించారు.