JN: లింగాలఘణపురం (M) చిటూర్లో గత ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మెట్ల సైడ్ వీల్ ఇరిగి వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ ట్యాంక్ అత్యంత దగ్గరలో చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రం ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.