W.G: ఆలూరు బస్టాండ్ సమీపంలో ఇవాళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి జిలాన్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ప్రారంభించారు. వేసవిలో వేడి నేపథ్యంలో ప్రయాణికులు, స్థానికుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.