GNTR: విద్యార్థులు మంచి విలువలు నేర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం, నీటి సంరక్షణలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకమని తెలిపారు.